Saturday, April 27, 2024

మమ్మల్ని టచ్ చేసే ధైర్యం ఉందా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కరీంనగర్/హైదరాబాద్:  బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటేనని రవాణా, బిసి సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ విషయం తాను ఎప్పుడో చెప్పానని, ఇపుడు కరీంనగర్ ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యలతో అది నిజమని తేలిందని వ్యాఖ్యానించారు. ఆదివారం క రీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. తమ ప్రభుత్వాన్ని బిఆర్‌ఎస్ కూల గొడుతుందని బండి మాట్లాడడం ఇందుకు నిదర్శనం కాదా అన్నారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను ముట్టుకునే ధైర్యం ఉందా… అంత ధైర్యం ఎవరూ చేయరని అన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బిఆర్‌ఎస్‌కి లేదన్నారు. జగద్గురు చెప్పినా అశాస్త్రీయంగా అయోధ్య రామాలయం ప్రారంభిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇది ఎన్నికల స్టంటేనని, లింగ ప్రాణప్రతిష్ఠ ఎవరు చేయాలో తెలియదా, ఇది అరిష్టం కాదా అన్నారు. రాముడి కటౌట్లు పెట్టుకుని బిజెపి ఓట్లు అడుగుతోందని ఆరోపించారు. బండి సంజయ్ మాట్లాడిన మాటలు జ్యోతిషం చెప్పినట్లుగా ఉందన్నారు. వైఫల్యం చెందిన ఎంపిలలో బండి సంజయ్ నంబర్ వన్ అని ఆరోపించారు. మాజీ ఎంపి వినోద్‌కుమార్ కరీంనగర్‌కు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని కోరారు. కెసిఆర్, వినోద్‌కుమార్ కరీంనగర్ ఎంపిలుగా ఏం అభివృద్ధి చేశారో, తాను ఎంపిగా ఏంచేశానో చర్చకు వస్తారా అని సవాల్ చేశారు. కెటిఆర్ అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. సిఎం పదవి కన్నా కెసిఆర్ పవర్‌ఫుల్ అనేది భ్రమ, కెసిఆర్ పదానికి పూజ చేసుకోండి అని ఎద్దేవా చేశారు. సిఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానం అని తండ్రి అంటే.. కొడుకు సిఎం పదం కంటే కెసిఆర్ పదం పవర్ అంటున్నాడని అన్నారు. జీవితంలో ఎప్పుడూ కూడా బిజెపి, కాంగ్రెస్ కలిసి పనిచేయవు అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు అంజన్‌కుమార్, నరేందర్‌రెడ్డి, మాచర్ల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెత్తి చూస్తే: అద్దంకి
కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెత్తి చూసే పార్టీల పతనాన్ని ప్రజలు చూసుకుంటారని కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను అలెర్ట్ చేసినట్టు చెబుతున్నారని, బిఆర్‌ఎస్, బిజెపిల మధ్య ఉన్న అనైతిక రహస్యమైత్రి తెలియంది కాదనీ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాం గ్రెస్ ఎమ్మెల్యేలే బిఆర్‌ఎస్ వైపు వస్తారన్న మాటలు చెప్పడం సరికాదని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకుంటే ఇటువైపు నుంచి అంతకంటే ఎక్కువ వ్యూహాలు ఉన్నాయని అద్దంకి వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News