Friday, March 29, 2024

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ తేదీలు ఖరారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ తేదీలను పోలీస్‌ నియామక మండలి(టిఎస్ ఎల్ పి ఆర్ బి) ఖరారు చేసింది. మార్చి 12 నుంచి మెయిన్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9న సివిల్‌ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 23న అన్ని రకాల కానిస్టేబుల్‌ పోస్టులకు మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తారు.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది. కాగా, ప్రస్తుతం ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి ఫిజికల్‌ ఈవెంట్స్‌ కొనసాగుతున్నాయి. ఈ నెల 5న దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News