Sunday, April 28, 2024

ఈటలతో డిసిపి సందీప్ రావు సమావేశం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ నివాసంలో అరగంటపాటు డిసిపి సందీప్ రావు సమావేశమయ్యారు. భద్రత అంశంపై ఈటలతో డిసిపి చర్చించారు. ఈటల భద్రతపై డిజిపికి డిసిపి నివేదిక ఇవ్వనున్నారు. ఈటల చెప్పిన అంశాలను డిజిపి వివరిస్తామన్నారు. ఈటల రాజేందర్ తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. హుజూరాబాద్‌లో ఈటెల వర్సెస్ ఎంఎల్‌సి పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. గత కొన్ని రోజుల ఇద్దరు మధ్య పచ్చి గడ్డి వేసిన మంటలు అంటుకునేవిధంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ కులాన్ని అసభ్యమైన పదజాలంతో తిట్టిన విషయం తెలిసిందే.

Also Read: రాహుల్ పర్యటన వేళ…మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News