Thursday, May 2, 2024

ఖమ్మంలో డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణలో మరో మెడికో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో డెంటల్ కోర్స్ చదువున్న సముద్రాల మానస అనే విద్యార్థిని ఆదివారం హాస్టల్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకొని బలవన్మరణం చెందింది. వరంగల్ జిల్లాకు చెందిన మానస మమత మెడికల్ కాలేజీలో డెంటల్ కోర్స్ నాలుగో సంవత్సరం చదువుతూ కళాశాలకు సమీపంలోని మధుర నగర్లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది ఆదివారం సాయంత్రం హాస్టల్లోని నాలుగో అంతస్తులో తన తన గది నుంచి బయటికి వచ్చి బాల్కనీలో శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

అప్పటివరకు స్నేహితులతో ముచ్చటించిన మానస ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకోవడంపై తోటి విద్యార్థులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మానస ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు ఆమె గది నుండి ఆమె సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఖానాపురం హవేలీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భౌతికయాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News