Thursday, May 2, 2024

సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డిజిపి అంజనీ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 30 న సిఎం కెసిఆర్ ప్రారంభించనున్న డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం భవనంలో భద్రతా ఏర్పాట్లను డిజిపి అంజనీ కుమార్, సీనియర్ పోలీస్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు. టీఎస్‌ఎస్‌పి అడిషనల్ డిజి స్వాతి లక్రా, లా అండ్ ఆర్డర్ విభాగం ఎడిజి సంజయ్ జైన్, నగర పోలీస్ కమీషనర్ సివి ఆనంద్, అడిషనల్ సిపి సుధీర్ బాబు, టఫ్శీర్ అహ్మద్ తదితర అధికారు లతో కలసి నూతన సచివాలయం ప్రాంగణంలో మొత్తం తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవం, అనంతరం నిర్వహించే సభ, వివిఐపిల ప్రవేశం, పార్కింగ్ ఏర్పాట్లు, సచివాలయంలోకి సిబ్బంది, అధికారుల ప్రవేశ మార్గంలో బందోబస్తు, తదితర ఏర్పాట్లను అంజనీ కుమార్ అధికా రులతో కలసి సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News