Thursday, May 2, 2024

ధర్మ బిక్షాన్ని స్మరించుకోవడం సూర్యాపేట ప్రజల బాధ్యత: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: ధర్మ బిక్షాన్ని స్మరించుకోవడం అనేది సూర్యాపేట ప్రజల బాధ్యత అని , సూర్యాపేట పేరు ప్రతిష్టలను దేశ వ్యాప్తంగా ఇనుమడింప చేసిన మహనీయుడు ధర్మబిక్షం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట మాజీ శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మ బిక్షం 12 వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట ముఖ ద్వారం అయిన ఎన్టీఆర్ పార్క్ చౌరస్తా కు ధర్మ బిక్షం చౌక్ గా నామకరణం చేసి ఘనంగా మంత్రి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ
చదువుతోనే జీవితానికి వెలుగు అని నమ్మిన నేత బిక్షం అన్నారు. ప్రజల కోసమే జీవితాన్ని దారాదత్తం చేసిన నాయకుడు అని కొనియాడారు. ధర్మ బిక్షం జీవితం తరతరాలకు స్పూర్తి అన్నారు. కల్లుగీత కుటుంబంలో జన్మించిన ధర్మభిక్షం కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి శ్రమించారని ప్రశంసించారు. దున్నేవాడిదే భూమి అన్నట్టుగా గీసేవాడిదే చెట్టు అన్న నినాదం ఇచ్చి వారి హక్కుల కోసం పోరాడారు. ఆయన సాగించిన కృషి ఫలితంగానే ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడిపోయిన కార్మికులకు ఎక్స్‌గ్రేషియా అమలులోకి వచ్చిందన్నారు. ప్రజా ఉద్యమ క్షేత్రంలోచట్టసభల్లోనూ పేదల పక్షాన నిలబడి, వారి తరఫున కలబడిన ధర్మభిక్షం అందరికీ ఆదర్శప్రాయుడు అని మెచ్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ అన్నపూర్ణమ్మ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారయణ, బూర బాల సైదులు గౌడ్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పుట్టా కిషోర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, బైరు వెంకన్న గౌడ్, కక్కిరేని నాగయ్య గౌడ్, చేనగాని రాంబాబు గౌడ్, యూత్ నాయకులు ఎల్గురి రాంబాబు, గుండపునేని కిరణ్ , అనంతుల విజయ్, దేశగానీ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ల, లక్ష్మి కాంతమ్మ, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, అనతుల యాదగిరి గౌడ్, రఫీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News