- Advertisement -
వాషింగ్టన్ : పెన్సిల్వేనియాలో బైడెన్ 81 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించినప్పటికీ ఆ ఫలితాలు చెల్లవంటూ ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీ వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఈమేరకు దాఖలైన రెండు పిటిషన్లను ధర్మాసనం ఏకగ్రీవంగా కొట్టివేసింది. ఇక్కడి పోస్టల్ ఓట్లను చెల్లుబడి కానివిగా పరిగణించాలని, విజేతను రాష్ట్రశాసన సభ ఎన్నుకునేలా ఆదేశించాలని వేర్వేరు పిటిషన్లలో రిపబ్లికన్ పార్టీ వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఎన్నికల్లో ఓటువేసిన సుమారు 70 లక్షల పెన్సిల్వేనియా పౌరుల హక్కును రద్దు చేయాలనేది అసాధారణ ప్రతిపాదన అని న్యాయస్థానం అభిప్రాయపడింది.
- Advertisement -