హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి టిఈఈఏ ప్రతినిధులకు హమీ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అధ్యక్షుడు శివాజీ ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ… 2020 సంవత్సరంలో విద్యుత్ ఉద్యోగులు మరింత కష్టపడి సంస్థను అభివృద్ది పథంలో నడిపించాలని సూచించారు. విద్యుత్ రంగం చాలాకీలకమైందని ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు కృషితో దేశ వ్యాప్తంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు కీర్తి ప్రతిష్టలు సాధించాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రిని కలిసిన వారిలో టీఈఈఏ ప్రధాన కార్యదర్శి రామేశ్వశెట్టి, పున్న నాయక్, లక్ష్మయ్య, చరణ్, రవి, లక్ష్మణ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.