Saturday, April 27, 2024

మహిళకు ఉచితంగా అరుదైన చికిత్స నిర్వహించిన విరంచి ఆసుపత్రి వైద్యులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: అత్యంత క్లిష్ట పరిస్థితులలో పేదరికంతో దిక్కు తోచని స్థితిలో మరో హాస్పిటల్ నుండి మార్చబడిన రోగికి పూర్తిగా ఉచిత వైద్యాన్ని అందించి రెండు నిండు ప్రాణాలను కాపాడిన విరించి హాస్పిటల్ వైద్యులు ఇక లాభం లేదని హైదరాబాదులోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ వారు చేతులెత్తేసిన తర్వాత కూడా ఏం చేయాలన్నా లక్షలు కావాల్సి రావడంతో దిక్కు తోచని పరిస్థితులలో 34 సంవత్సరముల గర్భిణిని భర్త విరించి హాస్పిటల్ కు తీసుకొని వచ్చారు. 22 వారాల గర్భంతో ఉన్న జి సునీత భర్తతో బైకుపై వెళుతుంటే యాక్సిడెంట్ కు గురై తీవ్రమైన గాయాలతో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్‌లో చేర్చారు. తలకు తగిలిన గాయాల కారణంగా ఆమె మెదడులోని నరాలు చిట్లడం, మెదడులోని రక్తం గట్టకట్టడం వంటి లక్షణాలతో హాస్పిటల్ లో చేర్చారు. ఈ సందర్భంగా సదరు కార్పొరేట్ హాస్పిటల్ లో తలకు సర్జరీ చేయడమే కాకుండా పుర్రె ఎముకను కొంత తొలగించి శస్ర చికిత్స చేశారు.

అనంతరం ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించాల్సి రావడం అది భారీ ఖర్చుతో కూడుకున్న పని అని తెలియడంతో అంత నిధులు వెచ్చించే స్థోమత లేని పరిస్థితులలో భర్త, ఇతర కుటుంభ సభ్యులు విషయాన్ని లతామా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రీస్టీ, ఛైర్‌పర్సన్ మాధవి లత దృష్టికి తీసుకు రావడంతో ఆమె విరంచి ఆసుపత్రి వైద్య బందాన్ని సంప్రదించింది.వెంటనే నిర్ణయం తీసుకొని సదరు పేషెంట్‌ను విరించి హాస్పిటల్‌కు మార్చారు. విరించి హాస్పిటల్‌కు తీసుకొని వచ్చే నాటికి తను సెప్టిక్ షాక్ కు గురై సుదీర్ఘకాలం వెంటిలేషన్ పై ఉండడంతో వచ్చిన నిమోనియాతో భాదపడుతోంది. అదే సమయంలో మెదడుకు తగిలిన గాయం కారణంగా కుడి చేతి వైపు కొంత మేర ఆమెకు పక్షవాతం ఏర్పడడం ఆమె ఆరోగ్య సమస్యను మరింత జఠిలం చేసింది. ఇటువంటి పరిస్థితులలో హాస్పిటల్ కు వచ్చిన మహిళ గర్భిణి కావడంతో పాటూ ఆమె కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ మహిళకు ప్రాణదానం చేయడం విరించి హాస్పిటల్ వైద్యులకు సరికొత్త సవాల్ ను విసిరింది. కడుపులోని బిడ్డకు హాని కలుగకుండా చూడాలంటే తీవ్రమైన స్థాయిలో యాంటి బయాటిక్స్ ను వైద్యులు వినియోగించలేకపోవడం వారి ముందున్న సమస్య. ఈ సవాల్ ను స్వీకరించిన విరించి వైద్య బృందం అడ్మిషన్ సయమం నుండి డిశ్చార్చి చేసే వరకూ ఎంఐసియులోనే ఉంచి చికిత్స చేయడంతో సదరు మహిళ పూర్తిగా కోలుకుంది.

ప్రస్తుతం మెదడుకు తగిలిన గాయాలతో ఏర్పడిన సమస్యలకు సంబంధించి ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ కొరకు ఫిజియో థెరపీ కేంద్రానికి సదరు పేషెంట్ ను తరలించారు. ఈ సందర్భంగా విరంచి సీఈవో డా. సాయి రవి శంకర్‌మాట్లాడుతూ వైద్య పరిభాషలోనే ఎంతో క్లిష్టమైన రోగికి చికిత్స అందించి బాగు చేయడమే కాకుండా పూర్తిగా ఉచితంగా వైద్యం అందించడంతో విరించి హాస్పిటల్ మరో మారు తన నైపుణ్యాన్ని, మానవత్వాన్ని చాటుకొందన్నారు. గతంలోనూ ఇలాంటి ఎన్నో సంక్లిష్టమైన పరిస్థితులలో రోగులకు చికిత్స అందించిన విరించి రెండు ప్రాణాలను కాపాడగలగడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News