- Advertisement -
8 గ్రామాలతో ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ తుది నోటిఫికేషన్ జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో కొత్తగా మరో మండలం ఏర్పాటయ్యింది. హుస్నాబాద్ డివిజన్లోని 8 గ్రామాలతో దూల్మిట్ట నూతన మండలంగా ఆవిర్భవించింది. దూల్మిట్ట, లింగాపూర్, జాలపల్లి, తోర్నాల, బైరాన్పల్లి, బెక్కత్, కొండాపూర్, కూటిగల్ గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ మంగళవారం రెవెన్యూశాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. మద్దూర్ మండలంలోని కమలాయపల్లి, అర్జునపట్ల గ్రామాలను చేర్యాల మండలానికి బదలాయిస్తున్నట్లు పేర్కొంది. మద్దూరు మండలంలో మొత్తం 21 గ్రామాలుండగా 8 రెవెన్యూ గ్రామాలతో దూల్మిట్ట మండలం ఏర్పడింది. ఈ మండలం హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ వెల్లడించారు.
- Advertisement -