Tuesday, May 7, 2024

ఇలాంటి ఫ్యామిలీ థ్రిల్లర్ రాలేదు

- Advertisement -
- Advertisement -

Drushyam-2 movie Trailer release

 

విక్టరీ వెంకటేష్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతోన్న దృశ్యం 2 చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం ఈనెల 25న రాబోతోంది. ఈ సందర్భంగా ఫిల్మ్‌మేకర్స్ హైదరాబాద్‌లో సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ.. “దృశ్యం- 2 చిత్రం మలయాళంలో చాలా పెద్ద హిట్‌గా నిలిచింది.

మలయాళంలో మోహన్‌లాల్, మీనా అద్భుతంగా చేశారు. తెలుగులో టీమ్ అంతా చాలా కష్టపడి.. అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇలాంటి ఫ్యామిలీ థ్రిల్లర్ ఈ మధ్య కాలంలో రాలేదు. రాంబాబు క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. రాంబాబు లాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉండాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి అతను ప్రయత్నిస్తాడు” అని అన్నారు. దర్శకుడు జీతూ మాట్లాడుతూ.. “ఈ చిత్రం తెలుగు వర్షన్‌లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. మూడు, నాలుగు సీన్లు మలయాళం ఉన్నవే.. కానీ కొద్దిగా మార్చాం. భారీ మార్పులు చేయలేదు. అలా చేసి ఉంటే.. మొత్తం స్టోరీపై ఎఫెక్ట్ పడేది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీనా, నరేష్, రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీ ప్రియ, ఎస్తర్, సంపత్, సుజా తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News