- Advertisement -
గువాహటి: అసోం రాష్ట్రంలో భూకంపం సంభవించింది. తేజ్పూర్లో ఆదివారం మధ్యాహ్నం 2.23 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. తేజ్పూర్కు పశ్చిమాన 40కీమీ దూరంలో భూ అంతర్భాగంలో 16 కిమీ లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని వెల్లడించింది.
Earthquake of Magnitude 4.1 hit Assam
- Advertisement -