Sunday, April 28, 2024

తరచూ భూప్రకంపనలు.. భయపడుతున్న జనం

- Advertisement -
- Advertisement -

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. నివేదికల ప్రకారం, జిల్లాలోని ముండ్లమూరు గ్రామంలో సుమారు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రకంపనలు రావడంతో ఆ ప్రాంత వాసులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపానికి ముందు పెద్ద శబ్ధం వినిపించిందని కొందరు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో తరచూ భూప్రకంపనలు వస్తుండటంతో ఆందోళన మరింత పెరిగింది. ఈ ఏడాది మార్చిలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రథసలో భూకంపం సంభవించి పలు ఇళ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News