Tuesday, May 14, 2024

మాపై ఈడి దాడులు జరుగుతాయి…సిద్ధంగా ఉన్నాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

హైదరాబాద్:   తమపైనా ఈడి దాడులు చేయించి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని.. ఆ దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియాతో మాటామంతీ జరుపుతూ ఆరోపించారు. కెసిఆర్ 21 ఏళ్ల కిందటే టిఆర్ఎస్ పార్టీని స్థాపించారని, ఆయన అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు 24 గంటలు విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రం తమదేనన్నారు. తెలంగాణలో ఇదివరలో 1000 గ్రామాలలో ఫ్లోరోసిస్ సమస్య ఉండేదని, దానిని తాము పరిష్కరించామన్నారు.  2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలే తమ టార్గెట్ అని.. ప్రస్తుతం పార్టీ పేరు మార్చామని, లోక్ సభ ఎన్నికల నాటికి బిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని తెలిపారు. దేశంలో రాజకీయ శూన్యత ఉందని.. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కు మంచి స్పష్టత ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్ మోడల్..అచ్చే దిన్  అంతా ఫేక్ అని.. ప్రధాని మోడీ అసమర్థుడని ఆరోపించారు. తమకు అవకాశం వస్తే తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసి చూపిస్తామని చెప్పారు. బిఆర్ఎస్ ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మద్దతు వ్యక్తమవుతోందని కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, అది కనుమరుగయ్యే అవకాశాలే ఎక్కువన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News