Friday, May 3, 2024

500-501 మధ్య చాలా జరిగింది: అశ్విన్ భార్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టెస్టు క్రికెట్ చరిత్రలో రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్లు తీసిన అనంతరం కొన్ని గంటల పాటు జట్టుకు దురమయ్యాడు. మళ్లీ జట్టులో చేరి ఒక వికెట్ తీసి విజయంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా అశ్విన్ భార్య ప్రీతి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు. హైదరాబాద్ టెస్టులో 500 వికెట్లు తీయాలని అశ్విన్ అనుకున్నాడు కానీ సాధ్యం కాలేదు… వైజాగ్ టెస్టులో 500 వికెట్ దక్కుతుందని ముందుగానే స్వీట్లు తెచ్చి పెట్టుకున్నామని, కానీ జరగకపోవడంతో అప్పుడే సీట్లు పంచామని, మూడో టెస్టులో 500 వికెట్ల మార్కును అశ్విన్ అందుకున్నాడు. కానీ తరువాత తాముంతా నిశ్శబ్ధంగా ఉండిపోయామని, 500 నుంచి 501 వికెట్ మధ్య చాలా జరిగిందని, అత్యంత సుదీర్ఘంగా గడిచిన 48 గంటల నుంచి చెబుతున్నానిన భావోద్వేగమయ్యారు. 500వ వికెట్లు ముందుకు, తరువాత గురించి మాట్లాడుతున్నానని, అశ్విన్ అసాధారమైన వ్యక్తి అని ప్రశంసించారు. అతడిని చూసి ఎంతో గర్వపడుతున్నానని, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని ఆమె తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News