Monday, April 29, 2024

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 22 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలి ఓవర్లలోనే జాక్ క్రాలే, జానీ బైర్‌స్టోను అక్షర పటేల్ ఔట్ చేశాడు. ఇంగ్లాడ్ జట్టు పరుగులేమీ చేయకుండా రెండు వికెట్లు కోల్పోయింది. డోమినిక్ సిబ్లే ఏడు పరుగులు చేసి పటేల్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో జోయ్ రూట్ (12), బెన్ స్టోక్స్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం బారత్ 11 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 112

ఇండియా తొలి ఇన్నింగ్: 145

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News