- Advertisement -
నాంటింగ్హామ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు భారత్ 54 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 154 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రిషబ్ పంత్ 25 పరుగులు చేసి రాబీన్ సన్ బౌలింగ్లో బైస్ట్రోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 26 పరుగుల ఆధిక్యంలో ఉంది. నిన్న వెలుతురు సరిగా లేకపోవడంతో ఆటను నిలిపేశారు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్(64), రవీంద్ర జడేజా(4) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బ్యాట్స్మెన్లు రోహిత్ శర్మ(36), ఛటేశ్వరా పుజారా(04), అజింక్య రహానే(05) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులు చేసింది.
- Advertisement -