Monday, April 29, 2024

షమీ హాఫ్ సెంచరీ… ఇండియా 298/8 డిక్లేర్డ్

- Advertisement -
- Advertisement -

లార్డ్స్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 109.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేయగానే విరాట్ కోహ్లీ డిక్లేర్ చేశాడు. ప్రస్తుతం భారత్ 272 పరుగుల ఆధిక్యంలో ఉంది. షమీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఐదు రోజు రిషబ్ 22 పరుగులు చేసి రాబిన్ సన్ బౌలింగ్‌లో జోష్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజు మహ్మాద్ షమీ(56), బుమ్రా(34) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఎనిమిదో వికెట్ పై షమీ-బుమ్రా 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా మోయిన్ అలీ, రాబిన్ సన్ చెరో రెండు వికెట్లు, శామ్ కరణ్ ఒక వికెట్ తీశాడు.

 

ఇండియా తొలి ఇన్నింగ్స్: 364

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 391

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News