- Advertisement -
లార్డ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు 55 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జోయ్ రూట్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుతం భారత్ 205 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో రోరీ బర్న్(49), డోమినిక్ సిబ్లే(11), హసీబ్ హమీద్ జీరో పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో జోయ్ రూట్(60), జానీ బైస్ట్రో(29) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా షమీ ఒక వికెట్ తీశాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 364
- Advertisement -