Saturday, April 27, 2024

ఈశా సింగ్‌కు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

Esha Singh won gold in shooting

 

మన తెలంగాణ/హైదరాబాద్: గుజరాత్ వేదికగా జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ యువ సంచలనం ఈశా సింగ్ షూటింగ్‌లో స్వర్ణం సాధించింది. శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఈషా పసిడి పతకం సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే ఈశా నిలకడైన ఆటను కనబరిచింది. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరి వరకు ఆధిక్యంలో నిలిచి స్వర్ణం దక్కించుకుంది. ఈశా 26 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకం గెలుచుకుంది. రిథమ్ (హర్యా) రజతం, అభిద్య (మహారాష్ట్ర) కాంస్య పతకాన్ని సాధించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News