Sunday, April 28, 2024

ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నా ప్రశాంతంగానే ఉన్నారు: ఈటల జమున

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్న సంతృప్తిగా ఉన్నారని ఆయన ప్రజలకోసం పనిచేస్తారని ఈటెల జమున అన్నారు. మంగళవారం ఆమె షామీర్‌పేటలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తాము ఎప్పుడు పదవుల కోసం పాకులాడలేదన్నారు.తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని, పరోక్షంగా ఉండి ఈటల రాజేందర్ కు అండగా ఉంటానని తెలిపారు. ఈటల రాజేందర్ ప్రతిష్ఠ దిగజారిందని,మెప్పు కోసం మాట్లాడబోతున్నారు అని వాట్స్‌ప్ లో పెడుతున్నారు. కానీ ఈటల ప్రతిష్ఠ ఎప్పుడు దిగజారదు.ఈటల ఉద్యమ కారుడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.తెలంగాణ ప్రజలు అనుకుంటే ఏ పార్టీతో అయినా కెసిఆర్ ను ఓడించడం సాధ్యమేని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 20 కోట్లు పెట్టీ ఈటల రాజేందర్ ను చంపేస్తా అని ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డి చెప్తున్నారని ఆమె ఆరోపించారు .ప్రజలే మమ్ముల్ని కాపాడుకుంటారని తామెప్పుడు చెడు పనులు చేయలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News