Sunday, April 28, 2024

కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు మాజీ మంత్రి డాక్టర్ ఎ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. “కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. త్వరలో కాంగ్రెస్ లో చేరుతా. ప్రజల్లో బిజెపి గ్రాఫ్ పడిపోయింది. తెలంగాణ ప్రభుత్వ అన్యాయాలను కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేస్తోంది. దీంతో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని ప్రజలు భావిస్తున్నారు” అనే పేర్కొన్నారు.

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో ఉన్న చంద్రశేఖర్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బిజెపి వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న చంద్రశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు.ఇందుకు సంబంధించిన రాజీనామా పత్రాన్ని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. కాగా, 1985 నుండి వికారాబాద్ లో డాక్టర్ చంద్ర శేఖర్ అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News