Wednesday, May 15, 2024

ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Extension of Inter First Year Admissions Deadline

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. గతంలో పొడిగించిన గడువు ఈ నెల 30 వరకు ఉండగా, దాన్ని మరో 16 రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు వచ్చే నెల 15 వరకు మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యార్థులు చేరుతున్నారు. ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల సంఖ్య లక్ష దాటింది.

ఐదారేళ్లుగా ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో రోజురోజుకీ ప్రవేశాల సంఖ్య పెరుగుతుండటంతో ఇంటర్ బోర్డు సెప్టెంబరు 15 వరకు ప్రవేశాల గడువును పొడిగించింది. ఓ వైపు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రవేశాలు జరుగుతుండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. మరో వైపు మొదటి ఏడాది విద్యార్థులకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ నెల 16నుంచి ఇంటర్ విద్యాశాఖ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించింది. ఈ నెలాఖరు వరకు దూరదర్శన్‌లో తరగతుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అధికారులు పాఠాలు ప్రసారం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News