Thursday, May 2, 2024

మేడిపల్లిలో నకిలీ డాకర్ల గుట్టు రట్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగర శివార్లలోని మేడిపల్లిలో నకిలీ డాక్టర్ల గుట్టు రట్టయింది. సులేఖా రాణి, గిరిధర్ అనే దంపతులు 2002 నుంచి డాక్టర్లుగా చెలామణీ అవుతున్నారు. గైనకాలజీ, డయాబెటిస్‌కు వైద్యం చేస్తామంటూ వీరు మోసాలకు పాల్పడుతున్నారు. పలు చోట్ల క్లినిక్‌లు పెట్టి వైద్యం అందిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఆరు నెలలకోసారి మకాం మారుస్తూ మోసం బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి గురించి పోలీసులకు సమాచారం అందడంతో మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News