Thursday, May 2, 2024

రైతే రాజు అనే కలను కెసిఆర్ నిజం చేశారు: ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Farmer is King

నిర్మల్: 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రైతు రాజ్యం అనే నినాదంతో గత ప్రభుత్వాలు పబ్బం గ‌డుపుకుంటున్నాయని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ భ‌వ‌న్ లో సోమ‌వారం నిర్వ‌హించిన‌ వానాకాలం పంట‌ల సాగు సన్నద్ధత- అవ‌గాహ‌న‌ సదస్సులో ఇంద్రకరణ్ రెడ్డి ప్రసంగించారు.  తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక సిఎం కెసిఆర్ రైతే రాజు అనే క‌ల‌ను నిజం చేశామన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేపట్టిన జలవికాస కార్యక్రమాలతో పుష్కల సాగునీటి వసతి రైతులకు అందుబాటులోకి వచ్చిందన్నారు.

  ఉచిత కరెంటు, పెట్టుబడిసాయం అందుతుందని,  రైతు సంక్షేమ పథకాలు భరోసాను నింపాయన్నారు.  సాగు కష్టాలు తీరడంతో కొద్దికాలంగా రైతులందరూ ఒకే రకమైన పంటలను సాగు చేస్తున్నారని, అలా కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహించాలని ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని,  ప్రత్యామ్నాయ పంటల ద్వారా కూడా అధిక లాభాలు పొందవచ్చన్నారు.  రైతులు కూడా సహకరించి వ్యవసాయ శాఖ తెలియజేసిన సూచనలు సలహాలు పాటించాలన్నారు.

 ఈ కార్యక్రమంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ కె.విజ‌య‌ల‌క్ష్మి రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖా శ్యామ్ నాయ‌క్, రాథోడ్ బాపురావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, క‌లెక్టర్ ముశ్ర‌ఫ్ ఫారూఖీ అలీ, ఆదిల‌ాబాద్ క‌లెక్ట‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్, నిర్మ‌ల్ జిల్లా రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షులు న‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి, అగ్రోస్ ఎండి రాములు, రైతులు, వ్య‌వసాయ, ఇత‌ర శాఖ‌ల అధికారులు హాజ‌ర‌య్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News