Tuesday, May 14, 2024

వాగులో ఎద్దుల బండి బోల్తా… ఎద్దులతోపాటు తండ్రీకొడుకుల మృతి

- Advertisement -
- Advertisement -

పల్నాడు: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం మాచవరం మండలంలోని గంగిరెడ్డిపాలెంలో ప్రమాదవశాత్తు వాగులో ఎద్దుల బండి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడకులు నాగరాజు, చరణ్ లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఎద్దులు కూడా మృతి చెందాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Father and Son killed after bullock cart fell into water in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News