Thursday, May 2, 2024

కూతురు అదృశ్యం…. తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వరంగల్: కూతురు కనిపించకపోవడంతో కన్న తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చౌటపల్లి గ్రామంలో నాగరాజుకు కూతురు ఉంది. 8వ తేదీన కనిపించకపోవడంతో గ్రామంలో ఎక్కవడ వెతికినా కనిపించలేదు. వెంటనే పర్వతిగిరి పోలీస్ స్టేషన్‌లో నాగరాజు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి చిన్నబోయిన సాయి, రాజశేఖర్‌ను విచారించారు. ఆయన కూడా బాలిక ఆచూకీ దొరకలేదు. మనస్థాపం చెందిన నాగరాజు ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకొని బయటకు వెళ్లాడు. మద్యం మత్తులో  పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ గేటు వద్దకు వెళ్లాడు. వెంటనే అతడిని పర్వతగిరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు. బాలిక కోసం వెతుకుతున్నామని ఎలాంటి పురోగతి కనిపించడంలేదని పోలీసులు వెల్లడించారు. ఇదే మండలంలోని కంబాలకుంట తండాకు చెందిన అదృశ్యమై ఇద్దరు బాలికలు శవాలుగా మారారు. ఇప్పటికి కూడా నిందితులను పోలీసులు పట్టుకోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News