Tuesday, May 7, 2024

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పియూసి ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోటపల్లి మండలం గోరేకల్‌కు చెందిన దీపికకు మంగళవారం ఫిజిక్స్ పరీక్ష ఉంది. అయితే తనకు మానసికంగా ఆందోళన ఉందని పరిపాలన భవనం వద్దకు వచ్చి తెలిపింది.

ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు దీపికకు కౌన్సెలింగ్ ఇచ్చే క్రమంలో బాత్‌రూంకి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాలేదు. అనుమానం వచ్చి భద్రతా సిబ్బంది చూసేసరికి చున్నీతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న దీపికను క్యాంపస్ హెల్త్‌సెంటర్‌లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. విద్యార్థిని పరీక్షించిన భైంసా ఏరియా హాస్పిటల్ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. దీపిక మృతి పట్ల ఆర్జియూకెటి బాసర అధికారులు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News