- Advertisement -
భారత యువ గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్ముఖ్ చరిత్ర సృష్టించింది. లండన్ వేదికగా జరుగుతున్న ఫిడే ప్రపంచ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టీమ్ ఛాంపియన్షిప్లో దివ్య దేశ్ముఖ్ సంచలన విజయం సాధించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో దివ్య ప్రపంచ నంబర్వన్ చెస్ క్రీడాకారిణి హౌ ఇఫాన్ (చైనా)పై చిరస్మరణీయ విజయం సాధించింది. మొదటి లెగ్లో ఇఫాన్ చేతిలో ఓడిన దివ్య రెండవ తెల్లపావులతో బరిలోకి దిగి జయకేతనం ఎగుర వేసింది. దివ్యను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా అభినందించారు.
- Advertisement -