Thursday, May 2, 2024

రోహింగ్యాల శిబిరంలో ప్రమాదం.. 56 గుడారాలు దగ్ధం

- Advertisement -
- Advertisement -

Fire rips through Rohingya camp

 

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో రోహింగ్యా శరణార్థుల కోసం వేసిన 56 గుడారాలు కాలి బూడిదయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. దాదాపు 270మంది రోహింగ్యాలు ఆ గుడారాల్లో నివాసముంటున్నారని వారు తెలిపారు. శనివారం రాత్రి కాలిందీకుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలోని శరణార్థుల శిబిరంలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 11.55కు తమకు సమాచారమందిందని, తెల్లవారుజామున 3 గంటల వరకల్లా మంటల్ని అదుపులోకి తెచ్చామని స్థానిక అగ్నిమాపకదళ అధికారి తెలిపారు. ప్రమాదానికి కారణమైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆగ్నేయ ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆర్‌పి మీనా తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News