Thursday, May 2, 2024

నదిలో కారు బోల్తా.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్రం దేవ్ గఢ్ లోని సికాటియాలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. బ్యారేజీ వద్ద వంతెనపై నుంచి కారు పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. వాహనం బ్యారేజీని దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. సెల్ఫీలు తీసుకోవడానికి వాహనం నడపడం, అది నియంత్రణ కోల్పోవడంతో వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

దేవ్ గఢ్ పోలీసు సూపరింటెండెంట్ అజిత్ పీటర్ మాట్లాడుతూ, ఎస్‌యూవీ డ్రైవర్ గాయపడగా, వారి కారు వంతెనపై నుండి బ్యారేజీలోకి పడిపోవడంతో ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు చనిపోయారని చెప్పారు. ఈ వాహనం శరత్, దేవ్ గఢ్ లోని అసన్‌సోల్ సంకుల్ గ్రామం నుండి గిరిడిహ్‌కు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News