Tuesday, April 30, 2024

ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

మంగళ వారం ఉదయం ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. మంగళవారం ఉడయం ఝాన్సీ-మీర్జాపూర్‌ జాతీయ రహదారిపై అమన్‌ఫూర్‌ ప్రాంతంలో డంపర్‌ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఐదుగురు ప్రయాణికులు ఘటనా స్థలిలోనే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News