Saturday, April 27, 2024

జాతీయ రహదారిపై వరద.. రోడ్డుపై నిలిచిన మంత్రి కాన్వాయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, రాంపూర్ చెరువు కట్టతెగడంతో జాతీయ రహదారిపై వరద నీరు చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లాలో వరద పరిస్థితులపై సమీక్షించడానికి హైదరాబాద్ నుండి బయలుదేరిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మార్గం మద్యలో రాంపూర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. స్థానికులు, వాహన దారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద తగ్గే వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్వయంగా మంత్రి సూచించారు. రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రజలను ఆమె కొరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News