Friday, May 3, 2024

మహింద్రా థార్‌కు పోటీగా గూర్ఖా ఎస్‌యువి

- Advertisement -
- Advertisement -
Force gurkha 2021 suv launch next week
15న మార్కెట్లోకి విడుదల చేయనెఉన్న ఫోర్స్ మోటార్స్

ముంబయి: స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్( ఎస్‌యువి) శ్రేణిలో మహింద్రా థార్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారత మార్కెట్‌లో మహింద్రా థార్‌కు పోటీగా ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ఎస్‌యువిని ఈ నెల 15న లాంచ్ చేయనుంది. గత ఏడాది గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఫోర్స్ గూర్ఖా ఎస్‌యువిని ప్రదర్శనకు ఉంచింది. ఈవెంట్‌లో చూపించిన విధంగానే ఎలాంటి మార్పులు లేకుండా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఫోర్స్ మోటార్స్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫోర్స్ గూర్ఖా వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఎస్‌యువి కారు ధరలు ఈనెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఫోర్స్ గూర్ఖా ధర రూ.8నుంచి 10 లక్షల వరకు ఉండవచ్చని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు.

ఫోర్స్ గూర్ఖాకు సింగిల్ స్లాట్ గ్రిల్, ఎల్‌ఇడి ప్రో ఎడ్జ్ హెడ్‌ల్యాంప్‌లతో పాటు డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, కొత్త బ్రాండింగ్‌తో కూడిన ఫెండర్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్స్, క్లామ్‌షెల్ బోనెట్, వెనుక డోర్‌కు మౌంటెడ్ స్పేర్ వీల్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వర్టికల్ టెయిల్ లైట్లు, హై మౌంటెడ్ ఎల్‌ఇడి లైట్లను గూర్ఖాకు అమర్చినట్లు తెలుస్తోంది. కారు ఇంటీరియర్స్ విషయానికి వస్తే మాట్టే బ్లాక్ డాష్ బోర్డు, సెంటర్ కన్సోల్‌తో గూర్ఖా రానుంది. కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అమర్చినట్లు తెలుస్తోంది. 2.6 లీటర్ల డీజిల్ ఇంజిన్‌ను కారులో అమర్చారు. 89 బిహెచ్‌పి సామర్థంతో 260 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. 5స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో నడవనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News