Saturday, May 4, 2024

స్పృహ‌లోకి వ‌చ్చిన న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్

- Advertisement -
- Advertisement -

Sai Dharam Tej who came to consciousness

 

హైద‌రాబాద్ : నిన్న సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న ఈయన కొద్దీ సేపటి క్రితం స్పృహ‌లోకి వచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు.  నిన్న రాత్రి కేబుల్ బ్రిడ్జి వ‌ద్ద బైక్‌పై వెళ్తున్న సాయిధ‌ర‌మ్ తేజ్ కింద ప‌డిపోవ‌డంతో అత‌ని ఛాతీకి బ‌ల‌మైన గాయాల‌య్యాయి. దీంతో అత‌న్ని జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. శ‌నివారం సాయంత్రం సాయిధ‌ర‌మ్ తేజ్ స్పృహ‌లోకి వ‌చ్చిన‌ట్లు అపోలో వైద్యులు తెలిపారు. స్పృహ‌లోకి వ‌చ్చిన సాయి ఒకే ఒక మాట మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. నొప్పిగా ఉంద‌ని సాయి చెప్పిన‌ట్లు స‌మాచారం. సాయిధ‌ర‌మ్ తేజ్‌కు డాక్ట‌ర్ అలోక్ రంజ‌న్ బృందం చికిత్స అందిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News