- Advertisement -
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ గురువారం అహ్మదాబాద్లో తుదిశ్వాస విడిచారు. గత నెల రోజులుగా ఆమె చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్ ఉదయ్పూర్లోని నివాసంలో మార్చి 31న పూజ చేస్తూ…హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని 90 గాయపడ్డారు. చికిత్స కోసం ఆమెను తర్వాత ఆసుపత్రిలో చేర్చారు. నాటి నుంచి ఆమె అహ్మదాబాద్లోని జైడస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయ్పూర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ ప్రముకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, గోవింద్ సింగ్, గుజరాత్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సంతాపం తెలుపడమేకాక, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
- Advertisement -