Friday, April 26, 2024

జగన్ పాలన ఆఫ్గాన్‌ను తలపించింది: గంటా

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: టిడిపి మేనిఫెస్టోపై వైసిపి నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని టిడిపి నేత గంటా శ్రీనివాస్ రావు మండిపడ్డారు. టిడిపి కార్యాలయంలో గంటా శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం ఆఫ్గాన్‌ను తలపించిందని, ప్రజా వేదిక కూల్చివేత నుంచి అధికారం ప్రారంభించారని, జగన్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. వైసిపి మేనిఫెస్టోను కాగితలకే పరిమితం చేసిందని గంటా దుయ్యబట్టారు. టిడికి అధికారంలోకి వచ్చాక హామీలు పూర్తిగా అమలు చేస్తామన్నారు. వైసిపి రాక్షస పాలను ప్రజలు చరమగీతం పాడాలన్నారు. టిడిపి మినీ మేనిఫెస్టోతో వైసిపి నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు.

Also Read: ఐపిఎల్ కప్ చెన్నైకే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News