Thursday, May 2, 2024

ప్రాణం తీసిన మొబైల్ గేమ్స్…

- Advertisement -
- Advertisement -

మొబైల్‌లో గేమ్స్ ఆడుతున్న కూతురిని మందలించిన తండ్రి

ఆత్మహత్య చేసుకున్న కుమార్తె

Girl commit suicide for games

మనతెలంగాణ, సిటిబ్యూరో: మొబైల్‌లో గేమ్స్ విపరీతంగా ఆడుతున్న బాలికను తండ్రి మందలించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మీర్‌పేట సర్వోదయ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓవ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె కౌసల్య(17) శ్రీచైత్య కాలేజీలో ఇంటర్ మీడియల్ చదువుతోంది. ఆదివారం రాత్రి ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండగా తండ్రి ఆమెను మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని రాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం లేచిన తల్లిదండ్రులు కూతురు ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో కిటికీ అద్దాలు పగులగొట్టి చూడగాఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు మీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని ఇన్స్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News