Sunday, April 28, 2024

జలకళతో గోదావరి బేసిన్

- Advertisement -
- Advertisement -

శ్రీరామసాగర్, నిజాంసాగర్‌లకు పెరిగిన ప్రవాహాలు
రైతన్నలకు వరంగా మారిన వర్షాలు
జోరుగా వ్యవసాయ పనులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి బేసిన్ ప్రాజెక్టు జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ఉద్ధృతిలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజేక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకూ వరద ప్రవాహాలు పెరిగాయి. శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు 1,21,008 ఇన్ ఫ్లో ఉండగా, దిగువకు 882 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను,63.47 టీఎంసీల నీరు నిల్వవుంది. ఇప్పటికే నిండిన నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 48,475 క్యూసెక్కులు, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 22.440 క్యూసెక్కుల వరద వస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 5.99 క్యూసెక్కుల వరద వస్తుండగా, 385 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.

జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 21.48 టీఎంసీలకు చేరుకుంది. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీకి 5,49,210 క్యూసెక్కుల వరద వస్తోంది. 5.49 లక్షల క్యూసెక్కుల నీటిని 75 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు.సింగూరు ప్రాజెక్టు లో ఇప్పటివరకు 21.48 టీఎంసీల నీరు నిల్వఉంది. పూర్తి స్ధాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు. కాగా ఈ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో 11.74 టీఎంసీల నీరు నిల్వఉంది. ప్రాజెక్టు పూర్తి స్ధాయి సామర్థ్యం 17.80 టీఎంసీలు.కాగా వరద ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. అదేవిధంగా శ్రీరామ సాగర్ ప్రాజెక్టులో 63.47 టీఎంసీల నీరు నిల్వఉంది.

ఈ ప్రాజెక్టు పూర్తిస్ధాయి సామర్థ్యం 90.31 టీఎంసీలు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పూర్తి స్ధాయి సామర్థ్యం 7.60 టీఎంసీలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్ధాయి సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.01 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. లోయర్ మానేరు రిజర్వాయర్ లో 24.07 టీఎంసీలు ప్రాజెక్టు సామర్ధ్యం ఉండగా ప్రస్తుతం 12.89 టీఎంసీల నీరు నిల్వఉంది. అదేవిధంగా మిడ్ మానేరు రిజర్వాయర్ లో 27.50 టీఎంసీల నీటీ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 15.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది.మరోవైపు కృష్ణానదిలో కూడా వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. ఆల్మట్టిలోకి 1.16లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది.శ్రీశైలం ప్రాజెక్టులోకి 28వేల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. తుంగభద్ర ప్రాజెక్టులో నీటి నిలువ 32టిఎంసీలకు చేరుకుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు రైతన్నలకు వరంగా మారాయి. వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News