Thursday, May 2, 2024

గొల్ల, కురుమలు ఆర్థికంగా ఎదగాలి

- Advertisement -
- Advertisement -

మణుగూరు : గొల్ల, కురుమలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కలెక్టర్ రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మణుగూరు మండలంలోని గుట్టమల్లారం హనుమాన్ ఫంక్షన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో రెండోవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో విప్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ చేతుల మీదుగా లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు.

ఈసందర్భంగా యాదవుల సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వారి కోసం మేకలు గొర్లు సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. యాదవుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసి వారి అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు.

రాష్ట్రంలో ఉన్న యాదవ సోదరులందరూ ఆర్ధికంగా బలోపేతం కావాలని రానున్న కాలంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర వారే పోషించే విధంగా తీర్చిదిద్దాలనేదే లక్షంతోనే సీఎం కేసీఆర్ పథకాన్ని తీసుకువచ్చారు అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన అందరికీ గొర్రెల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News