Friday, March 29, 2024

స్పీకర్ పుట్టినరోజును పురస్కరించుకొని సన్మానించిన గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

Governor Tamilisai

 

హైదరాబాద్ : పుట్టినరోజు సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. ఈసందర్భంగా స్పీకర్‌ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ వెంట శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

సుదీర్ఘకాలం ప్రజాసేవలో నిమగ్నం కావాలి: కెటిఆర్ ఆకాంక్ష
టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపాలిటీ, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్, మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు శానసభ్యులు, అధికారులు, శాసనమండలి సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్యం, శాంతి, సుదీర్ఘకాలం ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఈ సందర్భంగా కెటిఆర్ అకాంక్షించారు.

Governor Tamilisai birthday wishes to pocharam
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News