- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య నగరంలో రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం మరో ఇద్దరు అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఇప్పటివరకు 74 మందికి చేసిన పరీక్షల్లో వైరస్ లేదని నిర్థారణ అయ్యిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ వెల్లడించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. జలుబు ఉన్న దగ్గినప్పుడు ముఖానికి కర్చీఫ్ అడ్డం పెట్టుకోవాలని, రెగ్యులర్గా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది.
Suspected Corona Cases increases in Hyderabad
- Advertisement -