Sunday, April 28, 2024

కల్లబొల్లి కేంద్రం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ నుంచి ఎటువంటి విన్నపమూ రాలేదని బుకాయించిన కేంద్ర మంత్రి భారతీ పవార్

వైద్య కళాశాలల అభ్యర్థనపైనా పార్లమెంటులో అబద్ధపు ప్రకటన

పార్లమెంటు సాక్షిగా మంత్రులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు మొన్న రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన రాలేదన్నారు మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తి చేసింది కేంద్రం సహకరించకపోయినా సిఎం కెసిఆర్ నేతృత్వంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది: రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పదే పదే పచ్చి అబద్ధాలు వ ల్లె వేస్తున్నదని.. పార్లమెంట్ సాక్షిగా గోబెల్స్ ప్రచారానికి దిగిందని వ్యక్తం చేస్తూ.. ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుంచి రాలేదని చెప్పిన కేంద్రం.. శుక్రవారం మెడికల్ కాలేజీల ఏర్పాటుపైనా లోక్‌సభ వేదికగా దుష్ప్రచారం చేస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ పవార్ పార్లమెంట్‌లో చెప్పడం బాధాకరం అన్నారు.
మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. అయినా కేంద్ర మంత్రులు పార్లమెంట్ సా క్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతూ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. కేంద్రం సహకరించకపోయినా సిఎం నేతృత్వంలో జిల్లాకో మెడికల్ కాలేజీ దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తుందని హరీశ్‌రావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News