Saturday, April 27, 2024

ఖమ్మం మీ తాత జాగీరా?: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పట్టు బట్టి ఈ కాలేజీ సాధించారని, రూ.25 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, ఏడాదిలోగా పూర్తి చేస్తామని, గత పాలకులు వైద్య, అనుబంధ కోర్సులను నిర్లక్ష్యం చేశారని వైద్యారోగ్య, ఆర్థిఖ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఖమ్మం నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు.

అందుకే కేరళ నుండి నర్సులు వచ్చే వారని, ముఖ్యమంత్రి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయిం తీసుకున్నారని,  ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, మంత్రి కోరిక మేరకు ఖమ్మం జిల్లాకు బీఎస్సి పారామెడికల్ కాలేజీ కూడా త్వరలోనే మంజూరు చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.

Also Read: రేసింగ్ టీమ్‌ను సొంతం చేసుకున్న నాగ చైతన్య

మూడోసారి అధికారంలోకి వచ్చేది బి ఆర్ ఎస్ అని, ప్రజలంతా సిఎం కెసిఆర్ వెంటే ఉన్నారని, సీతారామ ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్ అని, ఇది పూర్తి అయితే కృష్ణా నదితో సంబంధం లేకుండా రెండు పంటలు పండుతాయని వివరించారు. ఏటా గోదావరిలో నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయని, కృష్ణా నదిలో నీళ్ళు రాకున్నా సమస్య ఉండదని, పనులు నిరాటంకంగా కొనసాగాలంటే కెసిఆర్ ను జై కొట్టాలన్నారు.

కాంగ్రెస్ వాళ్లది మేక పోతు గాంభీర్యలాగా ఉందని, ఖమ్మంలో ఒక్క సీటు రానివ్వం అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, ఖమ్మం కాంగ్రెస్ తాత జాగీరా అని హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పని చేసేది బి ఆర్ ఎస్ పార్టీ అని,  ఖమ్మం ఆసుపత్రికి త్వరలో ఎం ఆర్ ఐ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేస్తామని, 2014లో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 30శాతం, ఇప్పుడు 76 శాతంగా ఉన్నాయని, తాము ప్రజలకు కిట్లు ఇస్తే, కాంగ్రెస్ తిట్లు తిడుతున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News