Sunday, April 28, 2024

డిజిటల్, ఆర్థిక రంగాల్లో 25,000 మంది మహిళలకు హెచ్‌సిసిబి శిక్షణ

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 సందర్భంగా ప్రముఖ ఎఫ్‌ఎంసిజి సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతను అందించడానికి తమ బహుళ-రాష్ట్ర మహిళా సాధికారత శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. వై4డి ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించింది.

మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, ఒడిశాతో సహా 12 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ కార్యక్రమం డైనమిక్ క్లాస్‌రూమ్ ఆధారిత పద్దతిని అనుసరించింది. ఇది వివిధ నేపథ్యాల నుండి వచ్చిన మహిళల విభిన్న అవసరాలు, ఆసక్తులు, నైపుణ్యం స్థాయిలకు అనుగుణంగా రూపొందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News