- Advertisement -
హైదరాబాద్ : ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని బుధవారం నాడు హైకోర్టు సీరియస్ అయింది. తిరుపతిరావు ఇచ్చిన కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించింది. అధిక ఫీజులు వసూలు చేసే స్కూళ్ల జాబితా ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఏప్రిల్ 8లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ఈనేపథ్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
High Court Serious on Private Schools Fees
- Advertisement -