Thursday, May 2, 2024

బిజెపి పాలిత రాష్ట్రాల్లో అధిక విద్యుత్ ఛార్జీలు

- Advertisement -
- Advertisement -

High electricity tariffs in BJP-ruled states: B Vinod Kumar

24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా తెలంగాణ ఘనత
బిజెపి నాయకులారా..! వాస్తవాలు గ్రహించండి.. బురద చల్లడం మానుకోండి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

హైదరాబాద్ : బిజెపి పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, వీటికి సమానంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా బీజేపీతో పోటీ పడుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ నవ్వి పొదురు గాక నాకేమీ సిగ్గు.. అన్నట్లుగా పాదయాత్రలో బిజెపి రాష్ట్ర నాయకులు కనీస సోయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. బిజెపి, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ ఉండగా, కేవలం 7 గంటల పాటు మాత్రమే విద్యుత్ సరఫరా ఉందని, అదే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ, 24 గంటల పాటు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా సాగుతోందని వినోద్‌కుమార్ వెల్లడించారు.

రైతులకు 24 గంటల ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ ఒక్కటే అని అన్నారు.పరిశ్రమలకు సైతం ఇతర రాష్ట్రాల కన్నా తక్కువ టారిఫ్‌లోనే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు సాధ్యమయ్యాయని వినోద్‌కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రగతిని జీర్ణించుకోలేని బిజెపి రాష్ట్ర నాయకులు తప్పుడు ప్రచారానికి నడుం బిగించారని ఆయన విమర్శించారు. వాస్తవాలను గ్రహించి.. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వసూళ్లు చేస్తున్న విద్యుత్ టారిఫ్, తెలంగాణ రాష్ట్రంలో వసూళ్లు చేస్తున్న విద్యుత్ ఛార్జీల టారిఫ్ జాబితాను వెల్లడించారు.

రాష్ట్రాల వారీగా గృహ విద్యుత్ ఛార్జీలు
=====================
100 యూనిట్స్ — 200 యూనిట్స్
తెలంగాణ — 3.49 — 4.76
కర్నాటక — 7.39 — 8.07
గుజరాత్ — 6.35 — 6.83
ఉత్తర్ ప్రదేశ్ – 4.20 — 7.64
రాజస్థాన్ — 8.49 — 8.21
ఛత్తీస్ ఘడ్ – 4.32 — 4.32

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News