Sunday, April 28, 2024

అయోధ్యలో… భారీ భద్రత

- Advertisement -
- Advertisement -

ఎన్‌డిఆర్‌ఎఫ్, యాంటీబాంబు
స్కాడ్స్ 13000 మంది
జవాన్లతో కాపలా
అయోధ్య: తరతరాల నిరీక్షణ తరువాత అయో ధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అ యోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణం లో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల జ వాన్లు పహారాకాస్తున్నారు. ఉగ్రవాద బెదిరింపుల నేపథ్యంలో బాంబు విచ్ఛిత్తి దళాలు సర్వం సన్న ద్ధం అయ్యాయి. భద్రతా బలగాలో ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు, యాంటిబాంబు స్కాడ్స్ వీటికి తోడుగా సుశిత శిక్షణ పొందిన జాగిలాల బృందాలు, ఆర్‌పిఎఫ్ సిబ్బంది పారాహుషార్‌గా ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తం అయ్యారు. అయోధ్య రామాలయ ముఖద్వారం వద్ద పోలీసు సిబ్బంది కాపలాకాస్తోంది. బహుళ అంచెల భద్రతా వ్యవస్థ నడుమ ఇప్పుడు అయోధ్య సోమవారం నాటి కనులపండువ ప్రతిష్టాపనకు సి ద్ధమైంది.

ఇప్పటికే బాంబు స్కాడ్స్ తనిఖీలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ బలగం (ఎన్‌డిఆర్‌ఎఫ్) క్యాంప్ ఒకటి అయోధ్య క్షేత్రం వద్ద ఏ ర్పాటు అయింది. అవాంఛనీయ శక్తుల కదలిలక ను పసిగడుతూ, వీటిని తిప్పికొట్టేందుకు సమాయత్తం అయింది. ఆలయం వద్ద, ఇతర చోట్లా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరప్రదేశ్ శాంతిభద్రతల డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ ఆదివారం మీడియాకు తెలిపారు. భద్రతా బలగాల ఏర్పాట్లు, కృత్రిమ మేధతో పనిచేసే సిసిటీవీలు పదివేల వరకూ వివిధ ప్రాంతాలలో ఏర్పాటు అయినట్లు చెప్పారు. ఇక ఇరవైనాలుగు గంటల ని రంతర పర్యవేక్షణ సాగుతుంది. పలుచోట్ల కంట్రోలురూంలు నెలకొల్పారు. యాంటీ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగిస్తున్నారని డిజి వివరించారు. కాగా కీలకమైన లతా మంగేష్కర్ చౌక్ వద్ద ఆర్‌పిఎఫ్‌ను సిద్ధంగా ఉంచారు. సరయూ నదులు తరచూ పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్ల వద్ద పలు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సోమవారం ఉదయం నుంచి అయోధ్యలోకి కేవలం నిర్ణీత అనుమతి ఉన్న వాహనాలనే అనుమతిస్తారు. అయోధ్యలోని ప్రతి క్రాస్‌రోడ్‌లోనూ ముళ్లకంచెలను అమర్చారు. ట్రాఫిక్ పోలీసు విభాగం పట్టణంలో రాకపోకల నియంత్రణకు, ట్రాఫిక్ క్రమబద్థీకరణకు ఏర్పాట్లు చేసింది.

మ. 12.20 గంటలకు ముహూర్తం

అయోధ్యలో కీలకమైన విగ్రహ ప్రాణప్రతిష్ట ఘట్టానికి ముహుర్తం మధ్యాహ్నం 12.20 గంటల ప్రాం తంలో ఖరారు అయింది. ఇది మధ్యాహ్నం ఒంటిగంటకు సంపూర్తి అవుతుంది. ఆ తరువాత ప్రధాని మోడీ వేదిక నుంచి అక్కడ ఆహుతులై ఉండే దా దాపు 7000 మందిని ఉద్ధేశించి ప్రసంగిస్తారు. ఆ హుతులలో సాధువులు, పండితులు, వివిధ రం గాల ప్రముఖులు ఉంటారు. ప్రధాని సందేశం దేశవిదేశాలలో ప్రత్యక్ష ప్రసారం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ అంతర్జాతీయ మీడియా ఇప్పటికే ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించింది. టీవీలు, ఆన్‌లైన్ వేదికలు రిలేకు ఏర్పాట్లు చేసుకున్నాయి.

ఆలయ అంతర్భాగ చిత్రాలు విడుదల

ఆదివారం రామమందిర ప్రతిష్టాపన్ ట్రస్టు వారు రామాలయ అంతర్భాగం తెలియచేసే వీడియో దృశ్యాలను వెలువరించారు. వీటితో పాటు సంపూర్ణరీతిలో ఈ ఆలయ సముదాయానికి గావించిన అలంకరణలు, దైదీప్యమాన విద్యుద్దీపాల శోభల ను తెలిపే చిత్రాలు కూడా పొందుపర్చారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి పలువురు తరలివస్తున్నారు. అతిధుల జాబితాలోని కొందరు ఇప్పటికే పట్టణానికి చేరుకున్నారు. రాజకీయ, ఆర్థిక, వ్యాపార, క్రీ డా, సాంస్కృతిక, సినీరంగాలకు చెందిన వారు, టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు, వీరితో పాటు రా మాలయ నిర్మాణంలో కరసేవకులుగా మెదిలిన వా రు, ఉద్యమంలో పాలుపంచుకున్న వారు ఎందరెందరో తరలివస్తున్నారు. అత్యంత కీలక ఘట్టానికి ప్రధాని మోడీ ఇతర ప్రముఖులు రానుండటంతో భద్రతా బలగాలకు ఇప్పటి బాధ్యత గురుతరమైంది. అమితాబ్ బచ్చన్, అదానీ, అంబానీ వం టి పలువురు పారిశ్రామికవేత్తలు, సచిన్ టెండూల్కర్ , వివిధ రంగాలకు చెందిన వారు తరలివస్తున్నారు. ఇప్పటికే విశిష్ట అతిధుల జాబితాలోని వారి గురించి ప్రకటన వెలువడింది.

అయోధ్యలో వెలిసిన రామకాలపు చెట్లు

అయోధ్యలో ఇప్పుడు పలుచోట్ల వెలిసిన దాదాపు 7500 పూలచెట్లు అందరిని కనువిందు చేస్తున్నా యి. రామాయణ కాలం నాటి చెట్లుగా భావిస్తున్న వీటిని మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. అటవీశాఖ ప్రత్యేక శ్రద్ధతో వీటిని ఏర్పాటు చేసిం ది. నిండుగా విరబూసి ఉన్న ఈ చెట్లతో అయోధ్య ఇప్పుడు మరింత సుందరమయింది. వీటితో పాటు పలు విదేశీ చెట్లు వెలిశాయి. వీటిలో రెడ్ లిప్‌స్టిక్, రెడ్‌కాంగో, రింగ్ ఆఫ్ ఫైర్ బిర్కిన్, పింక్ ఫైర్, పిం క్ ప్రిన్సెస్ , డ్రాకానా మహాత్మా, అర్జున్ , గులార్, సల్,బన్యాన్ వంటివి వెలిసి మెరుస్తున్నాయి. రామజన్మభూమి ఆవరణలో నెలకొన్న నక్షత్రవాటికలో పలు రకాల చెట్లు అలరించేలా ఏర్పాట్లు చేసినట్లు స్థానిక అటవీ అధికారి సీతాంశు పాండే తెలిపారు.

అయోధ్య ఆకాశవీధిలో కాషాయఛాయలు

అయోధ్య ఆకాశవీధి ఇప్పుడు నీలం బదులుగా కా సాయ రంగు అలుముకున్నట్లుగా ఉంది. భవనా లు, టవర్లు ఇతర చోట్ల పెద్ద చిన్న కాషాయ జెం డాలు అమర్చడంతో ఇప్పుడు ఎవరు చూసినా చా లా దూరం వరకూ కాషాయరంగుల్లో ఆకాశం క న్పిస్తోంది. ప్రత్యేక అలంకృత రామపథం, ధర్మప థం వద్ద గుర్రాలపై వెళ్లుతున్న భక్తులు కాషాయజెండాలతో సాగుతున్నారు. జెండాలపై, శ్రీరాము డు, రామాలయం, హనుమాన్ బొమ్మలు కళకళలాడుతున్నాయి. గృహాలు, మఠాలు, దుకాణాలు , హోటళ్లపై కూడా కాషాయ జెండాలు ఎగురుతున్నాయి. కేవలం ప్రధాన వీధులే కాకుండా , పలు గల్లీల్లో కూడా కాషాయజెండాలు ఎగురుతున్నా యి. విద్యుద్దీపాలపై రామబాణం పోలిన గుర్తులు వెలిసి ఉన్నాయి.

పదిలక్షల ప్రమిదల జ్యోతులు

అయోధ్యలో సోమవారం సాయంత్రం ప్రాణప్రతిష్ట శుభసంకేతంగా పదిలక్షల మట్టి ప్రమిదల జ్యోతులు వెలిగిస్తారు. దియాలుగా వెలుగొందే ఇవి అయోధ్యలో ప్రతి దీపావళి రాత్రి సరయూ తీరంలో వెలిగించడం ఆనవాయితి. ప్రధాన రామాలయం, రామ్ కి పిడి, కనక్‌భవన్, గుప్తార్ ఘాట్, సరయూ ఘాట్, లతామంగేష్కర్ చౌక్ వంటి పలు చోట్ల ఈ దీపాలు వెలిగిస్తారని అధికారులు తెలిపారు. సోమవారం ప్రతి ఇల్లు దివాలీ సంబరాల కాంతులతో విలసిల్లాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పిలుపు నిచ్చారు.

ఆ నింగి నుంచి ఇదిగో అయోధ్య : ఇస్రో

బెంగళూరు : అయోధ్య రామాలయం దివి నుంచి చూస్తే ఏ విధంగా ఉంటుంది. దీనిని తెలియచేసే ఓ ఉపగ్రహ చిత్తరువును ఇస్రో ఇప్పుడు వెలువరించింది. ఇస్రో అనుబంధమైన హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌సిసి) ఈ శాటిలైట్ ఇమేజ్‌ను సేకరించి, నెట్‌లో అందరికి పరిచయం చేసింది. సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ నుంచి అయోధ్య ఆలయాన్ని గడిచిన సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన క్లిక్ మన్పించారు. రామాలయం, దశరథ మహల్, అయోధ్య రైల్వే స్టేషన్, సరయూ నది వంటి పలు అయోధ్య అంతర్భాగాలు అల్లంతదూరంలో ఏ విధంగా ఉన్నాయనేది ఈ ఉపగ్రహ చిత్తరువులతో వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News