Sunday, May 5, 2024

జ్ఞానవాపిలో పూజలకు హిందువులకు అనుమతి

- Advertisement -
- Advertisement -

వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పు

లక్నో : జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నేలమాళిగ లోని శివాలయం ఉన్నట్టు పేర్కొంటున్న ప్రాంతంలో పూజించే హక్కు హిందువులకు ఉందని స్పష్టం చేసింది. కాశీ విశ్వనాథ ఆలయ పూజారులే ఈ పూజలు నిర్వహించాలని వెల్లడించింది. ఈమేరకు బారికేడ్లు తొలగించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నేలమాళిగ లోని ఆలయంలో పూజలు చేసేందుకు సోమనాథ్ వ్యాస్ మనుమడు శైలేంద్ర పాఠక్ అనుమతి కోరారు.

ఈ పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయని న్యాయస్థానం వివరించింది. ఈ కేసుపై విచారణ జరిపిన వారణాసి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేష్ ఈమేరకు తీర్పు వెల్లడించారు. సోమనాథ్ వ్యాస్ కుటుంబం 1551 నుంచి అర్చక సేవలో కొనసాగుతోంది. 1992లో ఉత్తరప్రదేశ్ లోని బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత 1993లో ములాయం సింగ్‌యాదవ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు జ్ఞానవాపి లోని దక్షిణ నేలమాళిగలో పూజలు నిషేధించారు. దీనిపై సోమనాథ్ వ్యాస్, రామ్‌రంగ్ శర్మ, హరిహర్ పాండేలు కోర్టులోపిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సర్వే నెంబర్లు 9130, 31, 32 లు కాశీ విశ్వనాథుని ఆస్తి అని పేర్కొనడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News