- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. గురువారం శ్రీవారిని 68,095 మంది భక్తులు దర్శించుకోగా 23,932 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.7 కోట్లుగా అధికారులు వెల్లడించారు.
Also Read: హైదరాబాద్ విలవిల
- Advertisement -